రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా ” SALAAR ” ఈ డిసెంబర్ 22వ తేది విడుదల అవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో శృతహాసన్ హీరోయిన్ గా చేస్తోంది మరియు మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ ప్రభాస్ కి స్నేహితుడిగా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం కోసం నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా దానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆంధ్రా ప్రదేశ్ లో రూ.40 , తెలంగాణ లో రూ.65 పెంచుకునే అవకాశం ఇచ్చారు.అలాగే మల్టీప్లెక్స్ లో రూ.100 మేర పెరగనున్నాయి.దీనితో ఆంధ్రా ప్రదేశ్ మల్టీప్లెక్స్ లో రూ.225, సింగిల్ స్క్రీన్ లో రూ.165 గా ఉండనున్నాయి.అదే విధంగా తెలంగాణ లో మల్టీప్లెక్స్ లో రూ.413 మరియు సింగిల్ స్క్రీన్ లో రూ.253 గా ఉంటాయి.ఈ రేట్స్ ఆంధ్రా లో 10 రోజులు, తెలంగాణ లో వారం రోజులు అమలులో ఉంటాయి.